కార్తికేయకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా నేడు విడుదలైంది. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి రూపొందించాడు. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు.

చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయ శవాల్ని మోసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ పై ట్రాఫిక్ పోలీసులు చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ లో కార్తికేయ బండిపై లావణ్యను ఎక్కించుకుని వెళుతుంటాడు.

దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ హెల్మెట్ పెట్టుకుని సరిగ్గా బండి నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పనిలేదు బాలరాజు గారు అని క్యాప్షన్ ను జతచేసి పోస్ట్ చేసారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.