‘మా’ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

మా అధ్యక్ష ఎన్నికలపై నెలకొన్ని ఉన్న సస్పెన్స్‌ కు తెర పడింది. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవి కాలం ముగియడంతో వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక పక్రియ ప్రారంభించాలంటూ కొందరు సభ్యులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయిన కృష్ణంరాజు కు లేఖలు రాయడం జరిగింది. లేఖలపై స్పందించిన కృష్ణం రాజు తాజాగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో సెప్టెంబర్ 12 న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలంటూ నిర్ణయించారు.

ఆగస్టు 22న జనరల్‌ బాడీ మీటింగ్ ను నిర్వహించాల్సిందిగా కూడా నిర్ణయించారు. ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు ఇంకా కొందరు పోటీ పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సినీ పెద్దలు అంతా కలిసి మా ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తే తాను సిద్దం అంటూ మంచు విష్ణు ప్రకటించారు. కాని కొందరు మాత్రం మా ఎన్నికలు ఈసారి హోరా హోరీగా జరిగే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.