అదే ఊపులో తమిళ చిత్రాన్నీ పట్టేసిన ఉప్పెన భామ

ఉప్పెన చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఈ సినిమా సంచలనాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. భారీ కలెక్షన్స్ తో ఉప్పెన బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. కృతి శెట్టికు ఈ సినిమా ద్వారా బోలెడంత పాపులారిటీ వచ్చింది.

తొలి సినిమా విడుదల కాక ముందే కృతి శెట్టి టాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్టులను పట్టేసింది. నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ లో కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా కృతి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక కృతి ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోబోతున్నట్లు సమాచారం.