‘సర్కార్‌ వారి పాట’ స్టోరీ లైన్‌ ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రం పరశురామ్‌ దర్శకత్వంలో అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత లేదంటే ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సర్కార్‌ వారి పాట అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ చిత్రంలో బ్యాంకింగ్‌ రంగంలో మరియు ఆర్థికపరమైన వ్యవస్థల్లో జరుగుతున్న మోసాలను చూపించేలా దర్శకుడు స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. ప్రభుత్వంకు ఆదాయంలో గండి కొట్టేందుకు అనేక రకాలుగా కొందరు మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరి బండారంను బయట పెట్టేందుకు ఈ సినిమాలో హీరో చేసే పని ఏంటీ అనేది కథాంశంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈనెల 31న రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీర్తి సురేష్‌ లేదా కియారా అద్వానీల్లో ఒకరు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అలాగే సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు గాను లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.