కరోనా అవేర్ నెస్ కు సూపర్ స్టార్ ను వాడేసిన సైబరాబాద్ పోలీసులు

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్ లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, పోలీసులు మాస్కులు ధరించండి, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని చెబుతున్నారు.

ఈ రోజుల్లో ఏదైనా మీమ్స్ రూపంలో చెబితే ప్రేక్షకులకు బలంగా చేరుకుంటోంది. అందుకే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ విషయంలో మీమ్ షేర్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ ను వాడుతూ డెనిమ్ మీద డెనిమ్ వేస్తె ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ వేస్తె సేఫ్టీ ట్రెండ్ అని మీమ్ ను షేర్ చేసారు.

డబల్ మాస్క్ వేసుకుంటే డబల్ ప్రొటెక్షన్ అని వైద్యులు కూడా బలంగా చెబుతున్న కారణంగా సైబరాబాద్ పోలీసులు ఈ మీమ్ ను షేర్ చేసారు.