‘మహేష్ – త్రివిక్రమ్’ మూవీ పై క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరి కాంబినేషన్ లో అతడు ఖలేజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకోలేకపోయాయి. కానీ ప్రేక్షకులకు మాత్రం ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ గా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ అరవిందసమేత – అలవైకుంఠపురంలో సినిమాలతో మంచి జోష్ లో ఉండగా.. అటు మహేష్ బాబు వరుసగా సూపర్ హిట్స్ తో మరో బ్లాక్ బస్టర్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉండేసరికి ఈ కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఎందుకంటే త్రివిక్రమ్ – మహేష్ కాంబో వెండితెర పై సూపర్ హిట్ కాకపోయినా టీవీ ప్రేక్షకులకు పై మాత్రం మంచి ఫీస్ట్ మూవీస్ అనే చెప్పాలి. ఎందుకంటే అతడు – ఖలేజా సినిమాలు టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రకటించే సరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వీరి నుండి ఖలేజా సినిమా వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది. అందుకే ఇప్పుడు మూడో సినిమా అనేసరికి ఫ్యాన్స్ కొంచం ఉత్సాహంలో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మే 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ప్రతి ఏడాది తండ్రి పుట్టినరోజున తన సినిమాల గురించి ఏదొక అప్డేట్ ఇస్తుంటారు మహేష్. అయితే ఈసారి త్రివిక్రమ్ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారని టాక్.

అయితే ఈ కాంబినేషన్ మూవీ టైటిల్ ఇదే అంటూ అప్పుడే పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు ‘పార్థు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ముమ్మరంగా వైరల్ అవుతోంది. మరి అదే పేరుతో సినిమా రాబోతుందా లేదా అనేది మే 31న తెలియబోతుంది. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా పార్థు అనే పేరునే మేకర్స్ ఫిక్స్ చేసారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి అసలు విషయం తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు.