సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్ పుట్టుకు వస్తున్నాయి. కొందరు పని గట్టుకుని మంచు ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే మోహన్‌ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు ఫ్యామిలీ పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇతరత్ర కారణాల వల్ల సన్నాఫ్ ఇండియా దారుణమైన పరాజయం పాలయ్యింది.

కనీసం కోటి కూడా వసూళ్లు దక్కించుకోలేక పోయిందనే వార్తలు వచ్చాయి. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సన్నాఫ్ ఇండియా సినిమాను ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేశారు. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. కొనుగోలు విషయమై ఆలస్యం అవ్వడంతో ఎట్టకేలకు మంచు వారు మళ్లీ సన్నాఫ్ ఇండియాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కనీసం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ లో అయినా సన్నాఫ్ ఇండియా సినిమా పరువు దక్కించుకుంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.