టికెట్ రేట్ల విషయంలో మంచు విష్ణు సైలెన్స్ పై స్పందించిన నరేష్

ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయం ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉంది. పైకి కొంత మంది అంతా బానే ఉంది అన్నా కానీ ఇండస్ట్రీలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇటీవలే కలిసి ఈ విషయంపైనే మాట్లాడిన విషయం తెల్సిందే.

ఇక ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏ మాత్రం స్పందించకపోవడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా మాజీ అధ్యక్షుడు నరేష్ తన పుట్టినరోజును పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు. ఇదే సందర్భంగా మంచు విష్ణు మాట్లాడకపోవడం కూడా చర్చకు వచ్చింది.

దానికి నరేష్ స్పందిస్తూ, “‘మా’ అనేది స్వతంత్ర సంస్థ. దాని బాధ్యత నటీనటుల యోగక్షేమాలు చూసుకోవడం వరకే. పరిశ్రమకు చెందిన ఇతర అంశాల గురించి దానికి సంబంధం లేదు” అని నరేష్ తేల్చి చెప్పేసారు.