ఎయిర్‌ పోర్ట్‌లో అలా పిలిచారట, మోనాల్‌కు కోపం వచ్చింది

హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్‌ కొద్ది కాలానికే తెలుగు ప్రేక్షకులకు కనిపించకుండా పోయింది. ఇక మోనాల్‌ గజ్జర్ తెలుగు ప్రేక్షకులకు కనిపించదేమో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బిగ్‌ బాస్ సీజన్‌ 4 తో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు మొదట ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. కాని అభిజిత్ మరియు అఖిల్‌ లతో ఈమె నడిపిన కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అభిజిత్‌ మద్యలో బ్రేక్‌ అయినా అఖిల్‌ తో వ్యవహారం బాగానే నడిచింది ఇద్దరికి కూడా బాగానే కలిసి వచ్చింది.

ఈమద్య కాలంలో మోనాల్‌ ఇక్కడ బాగా బిజీ అయ్యింది. టీవీ షోలు మరియు సినిమాల షూటింగ్ ల్లో పాల్గొంటుంది. ఇటీవల ఆమె సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లి హైదరాబాద్‌ వచ్చింది. ఆ సమయంలో ఎయిర్‌ పోర్ట్‌ లో ఆమెను చాలా మంది అఖిల్‌ ఎలా ఉన్నాడు అంటూ అడగడంతో పాటు అఖిల్‌ అంటూ పిలిచారట. ఆ విషయంపై స్పందిస్తూ నాకు కోపం వచ్చిందని పేర్కొంది. బయటకు వచ్చాక మేము ఇద్దరం కలిసి ఉంటున్నామని కొందరు అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. అఖిల్‌ వాళ్ల ఇంట్లో ఉన్నాడు నేను వేరే ఉన్నాను అంటూ మోనాల్ క్లారిటీ ఇచ్చింది. అఖిల్‌ విషయం నన్ను అడిగితే ఎలా తెలుస్తుందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.