రంగ్‌దే సినిమాకు జీ5 సాలిడ్‌ ఆఫర్‌

నితిన్‌ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్‌ దే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఇన్ని రోజులు ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాని తాజాగా ఈ సినిమాను ఓటీటీకి అమ్మేందుకు సిద్దం అయ్యారు. జీ 5 సంస్థ ఈ సినిమాకు రూ.35 కోట్ల ఆఫర్‌ ఇవ్వగా నిర్మాతలు మాత్రం 40 నుండి ప్రస్తుతం రూ.38 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ డీల్‌ క్లోజ్‌ అయ్యే అవకాశం ఉంది.

జీ5 సంస్థ ఓటీటీ రిలీజ్ మాత్రమే కాకుండా థియేట్రికల్‌ రైట్స్‌ ను కూడా కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. వీలుంటే థియేటర్లలో లేదంటే వెంటనే ఓటీటీలో సినిమాను విడుదల చేసే విధంగా జీ5 సంస్థ ఒప్పందం చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం కు సంబంధించి కొద్ది తేడానే ఉండటంతో అతి త్వరలోనే ఆ విషయం కూడా క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే జీ5 సంస్థ సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాను కొనుగోలు చేశారు. థియేటర్లు ఓపెన్‌ అయిన కారణంగా థియేట్రికల్‌ రిలీజ్ కు సిద్దం అయ్యారు. మరి రంగ్‌ దే సినిమాను ఏం చేయబోతున్నారో చూడాలి.