పవన్ సరసన కియారా ఫైనల్ అయినట్లేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. ఇక మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్ లో త్వరలో నటించనున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కియారా అద్వానీ హీరోయిన్ గా భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందీ భామ.

మరి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెను అప్రోచ్ అవ్వగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో సినిమా చేస్తుందా అన్నది చూడాలి.