పిచ్చెక్కిస్తున్న పూనం కౌర్ ట్వీట్స్‌

నిజం ఎంతో ఏమో కాని టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వల్ల హీరోయిన్‌ పూనమ్‌ కౌర్ ఇబ్బంది పడిందట.. చనిపోయే వరకు కూడా వెళ్లింది అనేది టాక్‌. ఆ విషయం గురించి ఇప్పటి వరకు ఆమె అధికారికంగా స్పష్టంగా సమాధానం చెప్పిందే లేదు. కాని ఆమె ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా గందరగోళంగా మాట్లాడుతూ వచ్చింది. ఇటీవల పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగా మళ్లీ ఈ విషయమై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూనం వైపు అంతా చూస్తున్నారు.

ఇటీవల దాసరిని గుర్తు చేసుకుని బాధ పడ్డ పూనం ఇప్పడు గురువు గారు ఉండి ఉంటే బాగుండేది అంది. ఆ తర్వాత కూడా పరోక్షంగా ఎవరినో ఉద్దేశించినట్లుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్లీ మళ్లీ ఆడవాళ్లను అగౌరవ పర్చే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అత్యాచారం చేసిన వాడు బాధ పడాలి కాను నేను ఎందుకు బాధ పడుతాను అంటూ ఒక మహిళ మాట్లాడిన మాటలను ఆమె షేర్‌ చేయడం మరింత గందరగోళంకు తెర తీసింది. ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఎప్పటికి క్లారిటీ వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.