లాక్‌ డౌన్‌లో వెయిట్‌ పెరిగిన ప్రభాస్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరో ప్రభాస్‌ సాహో చిత్రం తర్వాత రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ లాక్‌ డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా ఆగిపోయింది. ఈ నాలుగు నెలు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడంతో ప్రభాస్‌ కాస్త బరువు పెరిగాడట. మామూలుగా భోజన ప్రియుడు అయిన ప్రభాస్‌ ఈ లాక్‌ డౌన్‌ లో ఇంట్లో ఉండి ఇష్టమైన ఫుడ్‌ ను లాగించేశాడట. షూటింగ్స్‌ లేకపోవడంతో ఎక్కువగా వర్కౌట్స్‌ కూడా చేయలేదట. దాంతో ప్రభాస్‌ ఈ సమయంలో లావు అయ్యాడట.

ప్రభాస్‌ బాహుబలి కోసం ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్‌ లేని కారణంగా ఫిజిక్‌ విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ప్రభాస్‌ వ్యవహరిస్తున్నాడేమో. ఎప్పుడైతే రాధాకృష్ణ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందో మళ్లీ ఫిజిక్‌ పై దృష్టి పెట్టి బరువు తగ్గుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాబోయే రెండు మూడు నెలల వరకు షూటింగ్‌ కు వెళ్లే ఉద్దేశ్యంలో ప్రభాస్‌ లేనట్లుగా ఉన్నాడు. కేవలం ప్రభాస్‌ మాత్రమే కాకుండా టాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నవంబర్‌ డిసెంబర్‌ వరకు షూటింగ్‌ కు వెళ్లేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది.

సాహో తర్వాత ప్రభాస్‌ చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ రాధేశ్యామ్‌ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను ఈనెల 10వ తారీకున పది గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈయన సినిమా చేయబోతున్నాడు. పాన్‌ వరల్డ్‌ మూవీగా నాగ్‌ అశ్విన్‌ మూవీ రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభించి 2022లో విడుదల చేస్తామంటూ నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఈయన సినిమా ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది.