ప్రభాస్ ‘రాధే శ్యామ్’పై ఇటలీ మీడియా స్పెషల్ కవరేజ్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. కోవిడ్ పరిస్థితుల తర్వాత మళ్ళీ ఈ చిత్ర టీం షూటింగ్ ప్రారంభించింది. ముందుగా అబ్రాడ్ సెట్స్ అన్నీ ఇక్కడ వేసి షూట్ చేద్దాం అనుకున్నారు కానీ ఫీల్ మిస్ అవుతుందని భావించి రిస్క్ తీసుకొని ఇటలీ వెళ్ళారు. గత కొద్ది రోజులుగా అక్కడే షూటింగ్ చేస్తున్న విషయం ఇదివరకే తెలిపాం. అలాగే అక్కడ పలువురు ఫాన్స్, పిల్లలు వెళ్లి షూటింగ్ టైములో ప్రభాస్ ని కలవడం లాంటి ఫోటోలు కూడా నెట్ లో హల్ చల్ చేశాయి.

తాజాగా రాదే శ్యామ్ విషయంలో మరో అరుదైన సంఘటన షాటు చేసుకుంది. అదేమిటంటే రాధే శ్యామ్ షూటింగ్ గురించి ఇటలీలో ఫేమస్ న్యూస్ ఛానల్ అయిన ‘టిజిఐ రాయ్’ వారు రాధే శ్యామ్ షూట్ పై స్పెషల్ కవరేజ్ ఇచ్చారు. పైడ్ మోంట్ లో జరుగుతున్న షూట్ లొకేషన్స్ నుంచి కొన్ని మేకింగ్ విజువల్స్ తో పాటు అక్కడ పని చేస్తున్న ఇటలీ టీం మరియు ప్రభాస్ నుంచి కూడా కొన్ని బైట్ ని తీసుకున్నారు. ఈ విజువల్స్ ని ప్రైమ్ టైం షో లో టెలికాస్ట్ చేయడం విశేషం.

ప్రస్తుతం ఈ విషయం ఇండియాలో ట్రెండ్ అవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా తో పాటు వరల్డ్ లోని పలు చోట్ల ఫాన్స్ ని సంపాదించుకున్న ప్రభాస్ ని ఈ కవరేజ్ అబ్రాడ్ ఫాన్స్ కి మరింత దగ్గర చేస్తుందని చెప్పాలి. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.