బాలయ్యతో సినిమా అంటే చాలా మంది భయపెట్టారు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖండ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తుంది. షూటింగ్‌ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. బాలకృష్ణకు తోడు ప్రగ్యా జైస్వాల్‌ కూడా అక్కడే ఉంది. షూటింగ్‌ లో ఉన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. ప్రస్తుతం బాలయ్య బాబుతో అఖండ షూట్‌ లో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది.

బాలకృష్ణతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడిగిన సమయంలో.. నేను అఖండ సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పిన సమయంలో చాలా మంది నన్ను భయపెట్టారు. ఆయనతో వర్క్‌ అంటే అంత ఈజీగా ఉండదు అంటూ హెచ్చరించారు. ఆయన ప్రవర్తన గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా నాతో చెప్పారు. కాని నేను షూటింగ్‌ లో జాయిన్ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయాను. ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడుతారు. ఆయన నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన చాలా సరదాగా మాట్లాడుతూ షూటింగ్‌ లో కెమెరా ముందుకు వెళ్లిన వెంటనే చాలా సీరియస్ అవుతారని ప్రగ్యా జైస్వాల్‌ చెప్పుకొచ్చింది. అఖండ సినిమా తో ఈమెకు టర్నింగ్‌ పాయింట్‌ దక్కుతుందా అనేది చూడాలి.