ఆ కొందరి వల్లే ‘మా’ మసకబారింది

వచ్చే నెలలో జరుగబోతున్న మా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఒక వైపు ప్రకాష్‌ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించి ఎన్నికలకు సిద్దం అవుతున్నాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ నుండి బండ్ల గణేష్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశం అయ్యింది. బయటకు వచ్చిన బండ్ల బాబు తెగ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడుతూ తనకు అవకాశం వస్తే అద్బుతాలు చేస్తానంటూ చెబుతున్నాడు.

తాజాగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మా లో చాలా మంది సభ్యులు ఉన్నారు. హీరోలు కొందరు ఓట్లు వేయడం లేదు. వారు అంతా కూడా ముందుకు రావాలి. మా సభ్యుల కోసం రూ.10 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించాడు. ఆరు నెలల్లోనే ఖచ్చితంగా మా చాలా మార్పులు తీసుకు వస్తాము. అన్ని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తాను అంటూ ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చాడు. ఇక మా ప్రాభవం తగ్గడానికి మా మసక బారడంకు కొందరు మాత్రమే కారణం అని.. అందరూ కాదని ఆయన అన్నాడు.