పుష్ప రెండు పార్ట్‌ లకు బడ్జెట్‌ కారణమా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతుంది అంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పుకార్లు వచ్చాయంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత మ్యాటర్ ఉండే ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. అందుకే పుష్ప సినిమా రెండు పార్ట్ లు నిజం అయ్యి ఉంటుందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ విషయంలో పుష్ప సినిమా యూనిట్‌ సభ్యులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయం ఒకటి చర్చనీయాంశంగా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో పుష్ప సినిమాను సుకుమార్ మొదలు పెట్టాడు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాను అనుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్‌ అనుకున్నదాని కంటే 50 శాతం అదనంగా అవుతుంది. దాంతో సినిమా రికవరీ ఎంత వరకు చేయగలుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేసి బ్రేక్ ఈవెన్‌ సాధించాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. దానికి తోడు సినిమా కథ కూడా రెండు పార్ట్‌ లకు సరిపోయేంత ఉందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.