రాధే శ్యామ్: బిగ్ డే గురించి అనౌన్స్మెంట్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాధే శ్యామ్. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

బాలీవుడ్ లో ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. సౌత్ లో అన్ని భాషలకు కలిపి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ లో మాత్రం మిథూన్, మనన్ భరద్వాజ్ పనిచేస్తున్నారు. మిథూన్ రెండు పాటలు కంపోజ్ చేయగా మనన్ మరో పాటకు సంగీతం అందిస్తున్నాడు.

రీసెంట్ గా మనన్ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. “కలలు నిజమవుతాయి. అవి మనల్ని ఎమోషనల్ చేస్తాయి. రాధే శ్యామ్ వచ్చేస్తోంది. నన్ను నేను గిల్లి చూసుకున్నాను. ఇది నిజమా కాదా అని. బిగ్ డే కోసం ఎదురు చూస్తున్నాను” అని పోస్ట్ చేసాడు.