సైకో పాత్రలో పిచ్చెక్కిస్తా అంటోన్న రాశి ఖన్నా

సాఫీగా సాగిపోతోన్న రాశి ఖన్నా కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద బ్రేక్ లా అయింది. అందులో ఆమె పాత్ర మిస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అది కొంత కాలమే అని నిరూపించింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమెకు చేతి నిండా అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్ లో గోపీచంద్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో పక్కా కమర్షియల్ చిత్రీకరణ జరుగుతోంది. మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న థాంక్యూ చిత్రంలో కూడా రాశినే హీరోయిన్.

ఇవి కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటోంది ఈ భామ. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వెబ్ ఫిల్మ్ రుద్రా ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ లో రాశి ఖన్నా ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ వెబ్ ఫిల్మ్ లో ఆమెది సైకో/హంతకురాలి పాత్ర అని తెలుస్తోంది. అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట.