కేటీఆర్ గారు ప్లీజ్‌ సాయం చేయండి : రష్మి

జబర్దస్త్‌ యాంకర్ రష్మి గౌతమ్‌కు మూగ జీవాలు అంటూ చాలా అభిమానం. రోడ్డుపై విధి కుక్కల కోసం లాక్ డౌన్‌ సమయంలో ఈమె ఆహారం పెట్టి మంచి మనసును చాటుకుంది. తాజాగా వీధి కుక్కల కోసం మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు వీధికుక్కల పెరగకుండా ఉండేందుకు గాను వాటికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి రోడ్డున వదిలేస్తున్నారు. ఆ వీది కుక్కలు రోడ్డున పడి చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కొందరు రష్మి దృష్టికి తీసుకు వచ్చారు.

రష్మి ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేసిన రష్మి దయచేసి ఈ విషయమై సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈ విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. కేటీఆర్ అయినా ఈ విషయమై స్పందించాలని జంతు ప్రేమికులు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున వీధి కుక్కలు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా రష్మి గౌతమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.