రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్ సినిమా విడుదల అయ్యేది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రవితేజ ఒక సినిమాను క్యాన్సల్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

క్రాక్ సినిమా విడుదల కాకుండానే రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసి ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నారట. కానీ కరోనా కారణంగా సినిమా కనీసం పట్టాలు కూడా ఎక్కలేదు. ఇక షూటింగ్ కూడా జరుపుకుంటుందో లేదో తెలియని పరిస్థితి.

క్రాక్ సినిమా విడుదల అయిన వెంటనే, షూటింగ్స్ కు అనుమతులు వచ్చిన వెంటనే రవితేజ తన సూపర్ హిట్ మూవీ “కిక్” రచయిత వక్కంతం వంశీతో సినిమాకు రెడీ అవుతున్నాడు. నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి నిరాశ పరిచిన వంశీకి చాన్స్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల అయ్యేలా వీరు ప్లాను చేశారు. అందుకే రమేష్ వర్మ సినిమాను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లుగా గుస గుసలు వినిపిస్తున్నాయి.