స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలకు సామ్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కు అత్యంత ఆప్తురాలు సన్నిహితురాలు అయిన శిల్పా రెడ్డి తో కలిసి తీర్థయాత్రలకు బయలుజేరింది. ఇద్దరు కలిసి దాదాపుగా రెండు వారాల పాటు తీర్థయాత్రల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు ఈ సందర్బంగా పలు పవిత్ర స్థలాలను మరియు దేవాలయాలను సందర్శించబోతున్నారు. గత కొన్ని రోజులుగా సామ్‌ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనుక వాటి నుండి బయట పడేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్‌ యాత్రలో ఉన్నారు. అక్కడి ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడం జరిగింది. సమంత మరియు చైతూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కలిసి చాలా హుందాగా ఎలాంటి విభేదాలు లేకుండా విడాకులు తీసుకున్నారు. ఇక ఇద్దరు కలిసి స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు మరియు వార్తలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్రను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.