శర్వా.. రష్మిక వాలెంటైన్స్ డే స్పెషల్

శర్వానంద్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 25వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అదే తేదీన పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో విడుదల విషయంలో కాస్త గందరగోళం కనిపిస్తుంది.

ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ప్రమోషన్ ను జోరుగా చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ సినిమా హడావుడి కనిపిస్తుంది. ఇటీవలే సినిమా టీజర్ ను విడుదల చేసి ఆకట్టుకున్న చిత్ర యూనిట్ సభ్యులు వాలెంటైన్స్ డే సందర్బంగా సినిమా నుండి ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఆద్య.. అనే పాట రాబోతుంది. పుష్ప సినిమా పాటలను కుమ్మేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా అదే స్థాయి మ్యూజిక్ ను ఇచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడు రెండవ పాట అది కూడా హీరోయిన్ రష్మిక పై ఆద్య అంటూ రాబోతున్న నేపథ్యంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పై అంచనాలు పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ మరియు రష్మిక జోడీకి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. సినిమా పై ఆసక్తికలిగేలా వీరి కలయిక పోస్టర్లు ఉన్నాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రచారం సోషల్ మీడియాలో తెగ జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కనిపిస్తుంది. శర్వానంద్ గత చిత్రాలు నిరాశ పర్చినా కూడా వాటి ప్రభావం ఈ సినిమా పై ఏమాత్రం కనిపించడం లేదు.

పుష్ప సినిమాలో శ్రీవల్లి గా కనిపించిన రష్మిక ఇంకా సోషల్ మీడియాలో ఆ పాత్రతో సందడి చేస్తూనే ఉంది. కనుక ఆ హడావుడి ఈ సినిమాకు కలిసి వస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రష్మిక మందన్నా మరియు శర్వాల జోడీ మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇంకా కిషోర్ తిరుమల మేకింగ్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మోస్ట్ వాంటెడ్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. మరి ఈ సినిమా శర్వా ప్లాప్ ల పరంపరకు ముగింపు పలికేనా చూడాలి.