అలరిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్..!

యువ హీరో శర్వానంద్ – లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”ఆడవాళ్లు మీకు జోహార్లు”. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మహా శివరాత్రి స్పెషల్ గా 2022 ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాండ్ తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల వదిలిన టైటిల్ ట్రాక్ వీక్షకులను ఆకట్టుకుంది.

ప్రమోషనల కంటెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం.. ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్ గా మారింది. ఈ క్రమంలో నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ‘ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో పదిమంది ఆడాళ్ళు ఉండి ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం’ అంటూ శర్వా వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో ప్రధాన పాత్రలందరినీ పరిచయం చేయడంతో పాటు.. ఈ సినిమా దేనికి సంబంధించినదనేది ఈ వీడియో వెల్లడిస్తుంది. తన కుటుంబంలోని మహిళలు ఆధిపత్యం చెలాయించడం వల్ల.. తన జీవితంలో ఎదురయ్యే పెళ్లి సమస్యను శర్వానంద్ ఇందులో వివరిస్తున్నారు. తన ఫ్యామిలీలో 10 మంది స్త్రీల అంగీకారం పొందడం అంత సులభం కాదు కాబట్టి.. పెళ్లికి సరైన అమ్మాయిని వెతకడం అతనికి చాలా కష్టంగా మారింది. అలాంటి సమయంలో రష్మిక మందన్నను చూసి ఇష్టపడటం మొదలుపెట్టాడు శర్వా.

‘మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో చాలా లక్కీ అండి’ ‘మీలాంటి జెన్యూన్ గా ఉండే పర్సన్ నాకు దగ్గరవడం నా అదృష్టం అండీ’ అని రష్మిక చెప్పడం చూస్తే ఆమె కూడా శర్వాని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ‘మన పెళ్లి జరగదు’ అని రష్మిక కూల్ గా చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కోపం బాధ ఫ్రేస్టేషన్ ఇరిటేషన్ డిప్రెషన్ టెన్షన్.. వీటన్నికంటే పైన ఉన్న పెద్ద లేయర్ లోకి వెళ్లి ఓ వెర్రి నవ్వు నవ్వడంతో టీజర్ ముగిసింది.

ఈ ఫన్నీ టీజర్ చూస్తుంటే తిరుమల కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్ తో ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ – రష్మిక మందన్న ఒకరితో ఒకరు అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. శర్వానంద్ చాలా కూల్ గా.. రష్మిక అందంగా కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్ కు ఆహ్లాదకరమైన బీజీఎమ్ అందించారు. అలానే సుజిత్ సారంగ్ కెమెరా పనితనం బాగుంది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనేది అన్ని ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపా రాజు – బెనార్జీ – కళ్యాణి నటరాజన్ – రాజశ్రీ నాయర్ – ఝాన్సీ – రజిత – సత్య కృష్ణ – ఆర్సిఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడింటింగ్ బాధ్యతలు నిర్వహించారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్.. తాజాగా వచ్చిన టీజర్ చూస్తే ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తారని అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.