కడుపులో అల్సర్లతో బాధపడుతున్న నటి

గత కొంతకాలంగా మేటి కథానాయిక శిల్పాశెట్టి పేరు ప్రముఖంగా మీడియా హెడ్ లైన్స్ లో వినిపిస్తోంది. ఇప్పుడు తన సోదరి షమితా శెట్టి పేరు మార్మోగుతోంది. కారణమేంటో తెలిస్తే షాక్ తింటారు. శిల్పా శెట్టి సోదరి నటి షమితా శెట్టి ప్రస్తుతం వివాదాస్పద రియాలిటీ షో `బిగ్ బాస్ OTT` ఆన్ వూట్ లో ప్రసారమవుతోంది. ఈ షోకి ప్రముఖ దర్శకనిర్మాత .. బాలీవుడ్ డీన్ కరణ్ జోహార్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసినదే.

ఈ షోలో షమితా శెట్టి తన దీర్ఘ కాలిక అనారోగ్యం గురించి హైలైట్ చేస్తూ జనాల అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి ఆహారం కోసం ఆమె ఇతర ఖైదీలతో గొడవపడటం కనిపిస్తుంది. షమిత పెద్ద ప్రేగులో మంటను కలిగించే కొలిటిస్ అనే వ్యాధితో బాధపడుతోందిట. అందువల్ల కొన్ని ఆహార పరిమితులను పాటించాల్సి ఉంటుంది. ఒక ఎపిసోడ్ లో తన వ్యాధి కారణంగానే సాధారణ ఆహారం తీసుకోలేకపోతున్నానని తెలిపింది.

తోటి పోటీదారు.. భోజ్పురి నటి అక్షర సింగ్ ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా షమిత కండీషన్ల ప్రకారం ఇతరులు కూడా ఆహారం తినలేకపోవడం సమస్యను తెస్తోంది. ప్రతి ఒక్కరూ అందులో(అక్కడ ఉన్నది) ఏదీ తినకూడదని షమిత హుంకరించడంతో అక్షర తనపై సీరియస్ గా కోపం ప్రదర్శించారు. 42 ఏళ్ల షమిత తన సమస్యను చెప్పడం ద్వారా తన వైపు ప్రేక్షకాభిమానుల దృష్టిని గరిష్ఠంగా ఆకర్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది.

అంతేకాకుండా షమితా శెట్టి పేరు మరో కోణంలోనూ మార్మోగుతోంది. తన బావ గారు.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలిచిత్రాల రాకెట్ లో చిక్కుకున్న క్రమంలోనే ఈ షోలో పాల్గొనడానికి ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత షమిత రియాలిటీ షోలోకి ప్రవేశించింది. సోదరి షమిత ఇలా చేయడంతో శిల్పా శెట్టి వివాదం తనని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.