తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పిన భరణి

నటుడు కమ్‌ రచయిత అయిన తనికెళ్ల భరణి ఫేస్ బుక్ లో షేర్‌ చేసిన శభాష్‌ శంకరా.. పోస్ట్‌ లు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటికి తనికెళ్ల భరణి స్పందించాడు. కొందరి మనోభావాలు నొప్పించే విధంగా తాను ఆ పోస్ట్‌ లను షేర్‌ చేసినందుకు క్షమించాలి. తాను ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పోస్ట్‌ ల వల్ల బాధ పడ్డ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను అంటూ ఈ సందర్బంగా ఆయన ఒక వీడియోను షేర్‌ చేశారు.

శివుడి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చెబుతూ వచ్చే తనికెళ్ల భరణి ఇటీవల కూడా అదే తరహా పోస్ట్‌ ను షేర్‌ చేశాడు. కాని అది కొందరి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉండటంతో ఆయనపై విమర్శలు వెళ్లువెత్తాయి. నీ కు ఇష్టమైన వారిని పూజించుకోవడం నీ ఇష్టం కాని ఇతరులను అనడం కరెక్ట్‌ కాదంటూ కాస్త సీరియస్ గానే భరణిపై ట్రోల్స్‌ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించాడు. వెంటనే ఆ పోస్ట్‌ ను డిలీట్‌ చేయడంతో పాటు క్షమించమంటూ అడగడంతో ఆ వివాదంకు ఫుల్‌ స్టాప్ పడ్డట్లయ్యింది. తనికెళ్ల భరణి ఇప్పటికి టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ నటుడు అనే విషయం తెల్సిందే.