ఇప్పుడు వరుణ్ తేజ్ కు కూడా కరోనా పాజిటివ్

ఈరోజు ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందని చెప్పిన విషయం తెల్సిందే. తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు పరీక్షలు చేయించుకోమని సూచించాడు రామ్ చరణ్. ఇది జరిగిన కొన్ని గంటలకే ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా సోకిందని తెలియజేయడం గమనార్హం.

రీసెంట్ గా మెగా ఫ్యామిలీ పలు మార్లు కలిశారు. నిహారిక పెళ్లి కోసం ఈ నెల మొదట్లో అందరూ మీట్ అయ్యి పెళ్లిని సెలబ్రేట్ చేసారు. అలాగే రీసెంట్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు కూడా అందరూ మీట్ అయ్యారు. మెగా కజిన్స్ మొత్తం క్రిస్మస్ సాయంత్రాన్ని ఎంజాయ్ చేసారు.

ఈ సెలబ్రేషన్స్ లో మెగా హీరోలు అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇలా అందరూ కలిశారు. వరుణ్ తేజ్ తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకాన్ని వెలిబుచ్చాడు.