షర్మిలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతు

తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల ప్రతి మంగళ వారం నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్నారు. వారంలో ఒక్క రోజు దీక్ష సందర్బంగా షర్మిల నిన్న నల్లగొండ జిల్లా చుండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబంను పరామర్శించారు. ఇటీవల శ్రీకాంత్ ఉద్యోగం రావడం లేదు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబంను కలుసుకున్న షర్మిల ఆ తర్వాత ఆయన కుటుంబంతో కలిసి అదే గ్రామంలో దీక్ష చేసింది.

షర్మిల దీక్షలో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌ రెడ్డి ఫోన్ ద్వారా షర్మిలతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం మీరు చేస్తున్న దీక్ష అభినందనీయం అన్నారు. మీ నాన్న గారు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మా గుండెల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌ కుటుంబంకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. మీరు నిరుద్యోగుల తరపున పోరాటం చేయడం మంచి పరిణామం. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ విషయంలో మీకు మద్దతు తెలుపుతున్నాం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా షర్మిల దీక్షలో పాల్గొన్నారు.