ఖుష్బూ ఇంట పెళ్లి సందడి

Share


చిత్ర పరిశ్రమలో మరో శుభవార్త వినిపిస్తోంది. ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆమె కూతురు అవంతిక వివాహం త్వరలో జరగనుండటంతో కుటుంబంలో సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో ఖుష్బూ తన భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి తో కలిసి కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ తో పాటు కూతురు అవంతికను తీసుకుని భారత ప్రధాని Narendra Modi ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు.

ఈ విషయాన్ని ఖుష్బూ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని తమ బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఖుష్బూ పెద్ద కుమార్తె ఆనందిత ఇప్పటికే సినీ రంగంలో నిర్మాతగా కొనసాగుతుండగా, చిన్న కుమార్తె అవంతిక త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టనున్నారు. ఆమె మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానున్నారని, అలాగే తమిళంలో ఒక స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారని సమాచారం.

ఇక ఇప్పుడు పెళ్లి వార్త వెలుగులోకి రావడంతో అభిమానులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వివాహం తర్వాత అవంతిక సినిమాల్లో కొనసాగుతారా లేదా కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: