బ్రదర్ గొడవలు.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్!

మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, ఇద్దరి మధ్య అసలు పొసగడం లేదని ఈ గత కొద్ది నెలలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య మంచు విష్ణు గొడవపడ్డ వీడియోను మనోజ్ షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తర్వాత ఆ వీడియో పై మోహన్ బాబు రియాక్ట్ అవ్వడం, విష్ణు కూడా అది ఒక రియాలిటీ షో అని కలరింగ్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.

కానీ మంచు బ్రదర్స్ మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని, ఇద్దరు విడిగానే ఉంటున్నారని నిత్యం వార్తలు వస్తూనే ఉండేది. రీసెంట్ గా మనోజ్ మౌనిక పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించలేదు. అంతేకాకుండా బయట ఎక్కడ చూసినా మంచు మనోజ్, మంచు లక్ష్మి కలిసి కనిపిస్తున్నారు తప్ప విష్ణు మాత్రం తమ్ముడికి దూరంగానే ఉంటున్నట్లు అనిపిస్తుంది. దాంతో నిజంగానే మంచు బ్రదర్స్ మధ్య సఖ్యత లేదన్నట్టు ఇండస్ట్రీలో సైతం టాక్ వినిపించింది.

ఈ క్రమంలోనే మంచి మనోజ్ తాజాగా అన్నదమ్ముల అనుబంధం గురించి చేసిన కామెంట్స్ వైరల్ మారాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సోదర’ మూవీ సాంగ్ రిలీజ్ చేసిన మంచు మనోజ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, బ్రదర్స్ మధ్యలో ఇగోలు, డబ్బు సమస్యలు రాకూడదని అవి వస్తే ఇక అంతే అన్నట్టు చెప్పుకొచ్చాడు.

” సంపూర్ణేష్ బాబుని చూస్తే చనిపోయిన మా కజిన్ గుర్తుకు వస్తారు. అదే స్వచ్ఛమైన నవ్వు. సంపూ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇగోలు డబ్బు సమస్యలు రాకూడదు. అవి వస్తే ముందుకు సాగాలి. బ్రదర్స్ మధ్య గొడవ ఉందంటే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ” చెప్పకొచ్చాడు మనోజ్.

దీంతో బ్రదర్ బాండింగ్ గురించి మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే, కెరీర్ పరంగా ఈమధ్య లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ తన సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తాజాగా ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలతో పాటు ఈమధ్య ఓటీటీ కోసం ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అటు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.