
సినీ సెలబ్రిటీలు షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా, కాస్త విరామం దొరికితే తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ అవ్వడం సహజం. తాజాగా అలాంటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ భామ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పోస్ట్తో అభిమానులను ఆకట్టుకుంది.
ఇటీవల వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న మృణాల్, కొద్ది రోజుల క్రితం చికాగో వెళ్లింది. అక్కడ గడిపిన క్షణాలను పూర్తిగా ఆస్వాదించిన ఆమె, స్టైలిష్ అవుట్ఫిట్స్లో నగర వీధుల్లో సందడి చేస్తూ కనిపించింది. విదేశీ అందాలను ఆస్వాదించడంతో పాటు, తనకు ఇష్టమైన వంటకాలను రుచి చూస్తూ సరదాగా గడిపింది.
ఇక ఇప్పుడు భారత్కు తిరిగి వస్తున్న నేపథ్యంలో, చికాగోలో గడిపిన మధుర జ్ఞాపకాలను ఫోటోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
“బ్యాగులు సర్దేశాను… ఈ నగరానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. నిజం చెప్పాలంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది” అంటూ ఏడుస్తున్న ఎమోజీని జోడించింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మృణాల్ గ్లామర్ లుక్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “చికాగో మీకు అంతగా నచ్చేసిందా?”, “మనసుకు దగ్గరైన ప్రదేశాన్ని వదిలి రావడం నిజంగా బాధాకరమే” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం రాకలో కీలక పాత్ర పోషిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న, జాన్వీ కపూర్లతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ భారీ ప్రాజెక్ట్పై మృణాల్ భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఆమె కెరీర్కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందో చూడాలి.
Recent Random Post:















