ధర్మపురి సంఘటన ఆధారంగా ‘ఆచార్య’ మూవీ

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్‌ ను కొట్టడం ఖాయం అన్నట్లుగా మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా ఆ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా కథ విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది ఒక రియల్‌ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సినిమా అంటున్నారు.

కొన్నాళ్ల క్రితం తమిళనాడులోని ధర్మపురిలోని ఒక దేవాలయంకు చెందిన భూములను కొందరు రౌడీలు ఆక్రమించుకోవాలని చూడగా ఆచార్య దాన్ని అడ్డుకున్నాడు. ఆ సంఘటనకు కాస్త కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి స్టోరీ అల్లిన కొరటాల శివ ఆచార్య సినిమాను రూపొందిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వబోతున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టాలని భావిస్తున్నారు. సినిమాను మే నెలలో విడుదల చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.