కరోనాతో సీనియర్ హీరోయిన్ కొడుకు మృతి

కరోనా ఎంతో మంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. ఇటీవల సీనియర్ నటి కవిత కుటుంబం కూడా కరోనా బారిన పడింది. కరోనా వల్ల ఎంతో మంది సెలబ్రెటీలు మృతి చెందుతున్న ఈ సమయంలో కవిత తనయుడు సంజయ్ కూడా కరోనాతో మృతి చెందాడు. అతడు రెండు వారాలుగా కరోనాతో బాధపడుతున్నాడు. ఆయన ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆరోగ్యం మరింతగా క్షీణించి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆయన మృతి పై కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

కవిత భర్త కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన కరోనా చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మరింత క్షీణించినట్లుగా తెలుస్తోంది. కవిత సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా నాలుగు పదుల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆమె బాల నటిగా 10 ఏళ్ల వయసు నుండే సినిమాల్లో నటిస్తున్నారు. ఆమెకు ఎంతో మంది పరిచయం ఉన్నారు. అలాంటి ఆమె కుటుంబ సభ్యులు ఇలా కరోనా బారిన పడటంతో ఎంతో మంది ప్రముఖులు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఆమె తనయుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పోస్ట్‌ లు చేస్తున్నారు.