షూటింగ్ మోడ్ లో బిజీగా ఆది పురుష్!

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. సాహో తర్వాత మూడేళ్లకు పైగా బ్రేక్ వచ్చింది ప్రభాస్ కెరీర్ లో. ముందుగా రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ విడుదలవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టేశాడు.

కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మిగతా రెండిటికీ బ్రేక్ ఇచ్చి ఆది పురుష్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందుకోసం ముంబైలోనే మకాం వేసాడు ప్రభాస్.

ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆది పురుష్ షూటింగ్ స్పాట్ నుండి సన్నీ సింగ్, ప్రభాస్ ఇంకా దర్శకుడు ఓం రౌత్ తో తీసుకున్న సెల్ఫీను పోస్ట్ చేసాడు. త్వరలోనే ఆది పురుష్ షూటింగ్ పూర్తవుతుంది.