నన్ను చంపేందుకు హంతకులతో మంత్రి చేతులు కలిపాడు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. హుజూరాబాద్‌ లో ఆయన పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ రజాకారుల ను తలపించేలా పాలన కొనసాగిస్తున్నట్లుగా ఆరోపించాడు. జిల్లాకు చెందిన మంత్రి హంతకులతో కలిసి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. హంతకులతో చర్చలు జరుపుతున్న ఆ మంత్రి నన్ను ఏం చేయలేడు అంటూ ఈటెల అన్నాడు.

అరె కొడకల్లారా ఖబర్దార్‌.. నర హంతకుడు నయీం చంపుతా అంటేనే నేను బెదరలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు భయపడేది లేదు. ఉగ్గుపాలతో ఉద్యమాన్ని చేసిన వాడిని. దుబ్బాకలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. 2018 లోనే నన్ను ఓడించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో నాకు ప్రజలు మద్దతు గా నిలిచారు. ఇప్పుడు కూడా నాకు ప్రజల మద్దతు ఉంటుందని ఈటెల పేర్కొన్నాడు.