నాకు రూ.2 వేల కోట్లు ఇవ్వండి నేను రాజీనామా చేస్తా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో గెలవడం కోసం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు ఇవ్వాల్సిందిగా ఎన్ని సార్లు కోరినా కూడా ఇవ్వడం లేదని.. ఆ రెండు వేల కోట్లను తన నియోజక వర్గంకు ఇస్తానంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఆయన పేర్కొన్నాడు.

రాష్ట్రంలో కొన్ని నియోజక వర్గాల వరకే నిధులు ఇస్తున్నారని ఆయన ఆరోపించాడు. హుజూరాబాద్‌ లో భారీగా ఖర్చు చేస్తున్న కేటీఆర్‌ కు ఇతర నియోజక వర్గాల పై ఎందుకు దృష్టి లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. తన నియోజక వర్గం అభివృద్దికి నోచుకోవడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రులను ముఖ్యమంత్రులను కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నాడు.