రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన లోటేమి లేదు. శర్వానంద్, అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన మహా సముద్రం చిత్రం విడుదలకు రెడీ అయింది.

మహా సముద్రం తర్వాత శర్వానంద్ నటిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు.

ఇదిలా ఉంటే ఎప్పటినుండో తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నాడు కొరియోగ్రాఫర్ రాజు సుందరం. తన దర్శకత్వంలోనే సినిమా చేయడానికి చూస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ ప్రాజెక్ట్ కు వక్కంతం వంశీ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే తెలిసే అవకాశముంది