చిరంజీవి కన్నా ముందే తమన్నా వస్తోంది!

టాలీవుడ్ టాప్ నటి సమంత ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే సెలబ్రిటీ టాక్ షోను నిర్వహిస్తోన్న విషయం తెల్సిందే. మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో చేయగా దానికి రెస్పాన్స్ బాగానే ఉంది. ఇక రెండో ఎపిసోడ్ లో గెస్ట్ లుగా రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్ లు వచ్చారు. ఈ ఎపిసోడ్ లో రానా తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయాలతో రెస్పాన్స్ విపరీతంగా వచ్చింది.

కేవలం సినిమా స్టార్స్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ పెర్సొనాలిటీస్ ను కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లను ఈ షోకు ఆహ్వానించారు. వీరిద్దరి గురించి తెలియని చాలా విషయాలు ఈ షో ద్వారా తెలిసాయి. ఇక సమంత కూడా హోస్ట్ గా మంచి మార్కులే వేయించుకుంటోంది.

అలాగే కొంత కాలం క్రితం చిరంజీవి ఈ షో కు వచ్చినట్లుగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ స్టిల్స్ లో మెగాస్టార్ లుక్స్ హైలైట్ గా ఉన్నాయి. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు బాగానే ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందే తమన్నా ఈ షో కు విచ్చేసిన ఎపిసోడ్ యాప్ లో దర్శనమివ్వనుంది.

సామ్ జామ్ లో తమన్నా చేసిన సందడి డిసెంబర్ 12 నుండి ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతుంది.