ఎన్టీఆర్‌ తో పాటు తమన్నాను లైన్‌ లో పెట్టిన జెమిని

తెలుగు బుల్లి తెరపై టాలీవుడ్‌ స్టార్స్ సందడి చేయడం కొత్తేం కాదు. బిగ్ బాస్ మొదటి సీజన్ తో ఎన్టీఆర్‌ ఆ తర్వాత నాని ఇక మీలో ఎవరు కోటీశ్వరుడుతో నాగార్జున, చిరంజీవిలు కూడా సందడి చేశారు. ఇక టీవీలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ఎన్టీఆర్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జెమిని వారు ఆ షో గురించి పదే పదే ప్రోమో విడుదల చేసి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇక అదే వారు ఎన్టీఆర్ తో పాటు తమన్నాను కూడా తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు బుల్లి తెరపై తమన్నాను చూడటం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తమన్నా ఒక టాక్ షో తో ఆహా లో రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆ టాక్ షో పట్టాలెక్కలేదు. ఇప్పుడు జెమిని వారు తమన్నాతో ఒప్పందం చేసుకున్నారట. టాక్ షో కోసం తమన్నా జెమిని టీవీ తో 50 ఎపిసోడ్స్‌ కు గాను వర్క్‌ చేయబోతుందట. 50 మంది సెలబ్రెటీలతో తమన్నా ముచ్చట్లు ఉంటాయి. ఈ షో ను ప్రముఖ డైరెక్టర్‌ సారధ్యంలో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.