‘ఉప్పెన’ హీరోకు నాగ్‌ భారీ ఆఫర్‌..?

ఇప్పటి వరకు అక్కినేని వారి బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం అక్కినేని హీరోలు మాత్రమే నటిస్తూ వచ్చారు. ఇతర సినిమాలు చేసినా చిన్నా చితక హీరోలు మాత్రమే నటించారు. కాని మొదటి సారి అక్కినేని వారి బ్యానర్ లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరో నటించేందుకు సిద్దం అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడట. పృథ్వీ అనే యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట.

ఉప్పెన సినిమాతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న వైష్ణవ్‌ తేజ్‌ ఇప్పటికే క్రిష్‌ దర్శకత్వంలో రెండవ సినిమా చేశాడు. మూడవ సినిమాను గిరీషయ్య దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక నాల్గవ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను ఏకంగా 4.75 కోట్ల రూపాయలను పారితోషికంగా వైష్ణవ్‌ తేజ్ అందుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి సినిమాకు 50 లక్షల వరకు పారితోషికం అందుకున్న ఈయన మూడవ సినిమాకు రెండు కోట్ల వరకు తీసుకుంటున్నాడు. నాల్గవ సినిమాకు ఏకంగా అయిదు కోట్ల వరకు పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఏ మెగా హీరోకు ఈ రేంజ్ పారితోషికం కెరీర్ ఆరంభంలో దక్కలేదు. త్వరలో ఈ సినిమా పూర్తి వివరాలు వెళ్లడించే అవకాశం ఉంది.