రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ జిమ్ గాయం వెల్లడి

Share


సినీ తారలు వెండితెరపై ఎంత గ్లామరస్‌గా కనిపించినా, ఆ ఫిట్‌నెస్ వెనుక తీవ్రమైన శ్రమతో పాటు ఎన్నో రిస్కులు దాగి ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన జిమ్ గాయం గురించి ఓ టాక్ షోలో ఆవేదనగా వెల్లడించారు.

నేహా ధూపియా, అంగద్ బేడీ హోస్ట్ చేస్తున్న ‘డబుల్ డేట్’ టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్, జిమ్‌లో జరిగిన ఓ ప్రమాదకర ఘటనను గుర్తుచేసుకున్నారు. 80 కేజీల బరువుతో డెడ్‌లిఫ్ట్ చేస్తుండగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తనకు తీవ్ర నడుము గాయం జరిగిందని తెలిపారు.

ఆ సమయంలో సేఫ్టీ బెల్ట్ ధరించకపోవడం పెద్ద తప్పిదమైందని ఆమె చెప్పారు. ఆ ఒక్క చిన్న పొరపాటు కారణంగా తనకు స్లిప్ డిస్క్ ఏర్పడి, దాదాపు 40 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని రకుల్ వెల్లడించారు. ఈ ఘటనను ఆమె “ఈగో లిఫ్ట్” అంటూ వ్యాఖ్యానిస్తూ, డెడ్‌లిఫ్ట్ వంటి వ్యాయామాలు సరైన మార్గదర్శకత లేకుండా చేయకూడదని హెచ్చరించారు.

ఈ గాయం తనను కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటివరకు యాక్టివ్‌గా ఉన్న తాను ఒక్కసారిగా కదలలేని స్థితికి చేరుకోవడం చాలా కష్టంగా అనిపించిందని, అది తన మానసిక స్థితిని కూడా దెబ్బతీసిందని తెలిపారు.

ఇలాంటి సమయంలో జీవిత భాగస్వామి మద్దతు ఎంత ముఖ్యమో ఈ అనుభవం తనకు నేర్పిందని రకుల్ చెప్పారు. కోలుకునే ప్రక్రియలో భర్త జాకీ భగ్నానీ అందించిన సహాయం, అండను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి క్షణం తనకు తోడుగా నిలిచిన జాకీ వల్లే ఆ కష్టకాలాన్ని తట్టుకోగలిగానని భావోద్వేగంగా తెలిపారు.

గతంలోనే ఈ గాయం కారణంగా నొప్పి ఉన్నప్పటికీ పెయిన్ కిల్లర్స్‌తో షూటింగ్‌లు పూర్తి చేసినట్లు, ఆ తర్వాత పరిస్థితి తీవ్రత పెరగడంతో వైద్యులు పూర్తిగా బెడ్ రెస్ట్ సూచించినట్లు ఈ షో ద్వారా స్పష్టమైంది. ఈ అనుభవం ద్వారా ఫిట్‌నెస్‌లో జాగ్రత్తలు ఎంత అవసరమో మరోసారి బయటపడింది.


Recent Random Post: