అల్లు అర్జున్ చేసిన ఆ సినిమా మొదట నా దగ్గరకే వచ్చింది: సుమంత్

టాలీవుడ్ నటుడు సుమంత్ ఇప్పటికే దాదాపు 25 వరకూ సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన లేటెస్ట్ సినిమా కపటధారి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే సుమంత్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు సుమంత్.

“నేనెప్పుడూ నాకు తగ్గ కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్లాను. ఒకసారి పూరి జగన్నాథ్ నా వద్దకు వచ్చి ఓ కథ చెప్పాడు. అది నాకెంతో నచ్చింది. అయితే అది నాకు అస్సలు సెట్ కాదు. అదే విషయాన్ని పూరి జగన్నాథ్ కు చెప్పాను. ఆ సినిమానే దేశ ముదురు. తర్వాత అల్లు అర్జున్ తో ఆ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా బన్నీ చేసాడు కాబట్టే హిట్ అయింది. నేను చేసి ఉంటే కచ్చితంగా ప్లాప్ అయి ఉండేది” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసాడు సుమంత్.